మైనార్టీలకు రంజాన్ తోఫాల పంపిణీ…

0 8,645

 

రుద్రూర్ బతుకమ్మ :

 

రంజాన్ పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని మైనార్టీ కుటుంబాలకు గురువారం ఉప సర్పంచ్ నిస్సార్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని తెలిపారు. కఠోర ఉపవాస దీక్షలతో అల్లాహ్ ని ప్రార్థిస్తూ దేశం, రాష్ట్రం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారని తెలిపారు. ఇంతటి పవిత్రత కలిగిన పండగను నిరుపేదలు సైతం ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలనే సంకల్పంతో నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేసినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షేక్ సుభాని, మైనార్టీ నాయకులు, మైనారిటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.