భిక్కనూరు, బతుకమ్మ: భిక్కనూరు మండలంలోని కంచర్ల గ్రామంలో ధాన్యం ట్రాక్టర్ గుంతలో పడి అదుపుతప్పి బోల్తా పడింది. కంచర్ల గ్రామం నుంచి పెద్ద మల్లారెడ్డి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో లారీలు రావడం కష్టంగా ఉందని, దీంతో చేసేదేమీ లేక ట్రాక్టర్ల ద్వారా బస్తాలను రైస్ మిల్ కు తరలిస్తున్నామని, వీటిని తరలించే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.