. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షుల జాబితాను శనివారం అధికారికంగా విడుదల చేశారు.

నగర కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులకు పార్టీ శ్రేణులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఈ నియామకాలను స్వాగతిస్తూ, కొత్తగా ఎంపికైన నాయకులకు అభినందనలు తెలిపారు.

నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ సంస్థను మరింత బలపరచడంలో ఈ నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయ ని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే స్థానిక స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కొత్త కమిటీలు పనిచేయనున్నట్లు సమాచారం.
