26.6 C
Hyderabad
Monday, August 3, 2026

లింగంపేట్ లో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బుధవారం రిబ్బన్ కట్టింగ్ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ద్వారాలు కాంగ్రెస్ కార్యకర్తలకు, అలాగే ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, కార్యకర్తల అభిప్రాయాలకు ఈ కార్యాలయం వేదికగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నూతనంగా నియమితులైన డీసీసీ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్, సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

 

New Congress party office inaugurated in Lingampet

More articles

Latest article