. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యుత్ ఆర్టిజన్, అన్ మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ సర్కిల్ ఆఫిస్ వద్ద నిజామాబాద్ & డిచ్ పల్లి డివిజన్లు ఏప్రిల్ 8 నుంచి నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బుధవారం సంఘీభావం తెలియజేశారు. వారి న్యాయమైన డిమాండ్లను, సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

