29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, రామన్న పెట్ సర్పంచ్ బెల్దరి నవీన్, ఉప సర్పంచ్ తెడ్డు గోవర్ధన్, ఐకెపి సీసీలు మురళీ, రామడుగు మోహన్, పొన్నాల చిన్నయ్య వీవోఏ మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article