29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బోధన్ లో కత్తిపోట్లు

Must read

📰 Generate e-Paper Clip

.. ముగ్గురికి గాయాలు

 బోధన్ , బతుకమ్మ  :

బోధన్ పట్టణంలోని గాంధీ నగర్ లో కత్తిపోట్ల కలకలం రేపింది.  శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. గాంధీనగర్ కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు అనే యువకులు వీధిలో కూర్చొని మాట్లాడుతుండగా  అటువైపుగా వెళుతున్న మన్సూర్ అనే వ్యక్తి, ముగ్గురు తననే ఉద్దేశించే మాట్లాడుతున్నారన్న అనుమానంతో  కత్తితో దాడి చేశాడు.

 

Stabs in teaching స్థానికులు ఎంత వారించినా వినకుండా ముగ్గురిపై దాడికి ఎగబడ్డాడు. మన్సూర్ తో పాటు తన సోదరులు అన్వర్, బాసీత్ లు సైతం ఈ దాడిలో భాగస్వాములుగా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గాయాలైన రెహాన్, జావిద్, బబ్లు లను స్థానికులు తక్షణమే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Stabs in teaching

More articles

Latest article