వెబ్ న్యూస్, బతుకమ్మ : నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లేనే ఇంటికి తెచ్చి ఇస్తుండటంతో రోజు రోజుకు ఫుడ్ డెలివరీ విభాగానికి ఆదరణ పెరుగుతుంది. దీంతో ఈ విభాగంలో అడుగు పెట్టాలని ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో చూస్తోంది. పైలట్ ప్రోగ్రాంలో భాగంగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది.