వెబ్ న్యూస్, బతుకమ్మ : ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో (Q2 RESULTS) రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈమొత్తం రూ. 18,331 కోట్లు ఉంది. ఈఏడాదిలో 10 శాతం వృద్ధి నమోదైంది. సమీక్ష త్రైమాసికానికి ఎస్ బీఐ మొత్తం ఆదాయం రూ. 1,29,141 కోట్ల నుంచి రూ. 1,34,979 కోట్లకు పెరిగింది.
