హైదరాబాద్, బతుకమ్మ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఇంట్లోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలారు . దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందెశ్రీ రాసిన ’జయ జయహే తెలంగాణ‘ ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. అందెశ్రీ మరణంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అన్ని పార్టీల ముఖ్య నేతలు, సాహితీ, సినీ ప్రముఖులు దిగ్బాంత్రి వ్యక్తం చేశారు.
