బీబీపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయంలోబిబిపేట బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు మేఘవర్ణని ఎంపీడీఓ శనివారం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో పూర్ణ చంద్రోదయ కుమార్. మాట్లాడుతూ సమాజంలోని, నిరుపేదలకు చేస్తున్న నిస్వార్థ సేవలకు గుర్తింపుగా సన్మానించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు సమాజానికి నిస్వార్థచేయాలని, అనాధలకు, పేదలకు, సహాయం చేయడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఆర్టిఐ. మండల అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ బీదలు అనాధలు దేవుళ్ల లాంటి వారు అని అన్నారు. వారికి సేవ చేస్తే దేవునికి చేసినట్లే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో,ఈ. ఓ. రమేష్. హెచ్ఎం. రామేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు మేఘ వర్ణ, ఆర్.టి.ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి, పండ్ల హనుమంతు, జిపి కారోబార్ సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.
