అమరావతి, బతుకమ్మ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు, రూ.57,962 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.50కి ప్రధాని మోదీ విజయవాడ చేరుకోనున్నారు. బహిరంగ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. సభ జరిగే ప్రాంతం నుంచి 5 కి.మీ. పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది.