వెబ్ న్యూస్, బతుకమ్మ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మరో ఘనతను సొంతం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం మీనాక్షిని ఏపీ ఉమెన్ ఎంపవర్ మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధికారికంగా ప్రకటన వెలవడనునున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో మీనాక్షి సూపర్ హిట్లను అందుకుంది. చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.