కంటేశ్వర్, బతుకమ్మ : నిజామాబాద్ కంటేశ్వర్లోని జయశంకర్ విగ్రహం వద్ద శనివారం మధ్యాహ్నం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఆత్మీయంగా సమావేశమై ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాక్షర దినపత్రిక జర్నలిస్ట్ ప్రకాష్, ప్రజా మీడియా సంపాదకులు డి.ఎల్.యన్ చారి, ప్రజా కలం జర్నలిస్ట్ అంగుళి మాలజీ, డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సౌడ జయరాజ్, ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మూలనివాసి మాలజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలు, జయశంకర్ ఆశించిన అభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ పురోగమించిందా అనే అంశాలపై చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ముగించుకుని అనంతరం జర్నలిస్టులతో కలయికలో పాల్గొన్నారు.