కామారెడ్డి, బతుకమ్మ : ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని కామారెడ్డి జిల్లా పీఏసీఎస్ ఛైర్మన్లు శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొత్తగ పెట్టిన కొన్ని కండిషన్స్ వలన సొసైటీలు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. వెంటనే స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు, కల్లాలో ఉన్న ధాన్యం కొనుగోలు ప్రారంభించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.