నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఆదేశాలమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రం లో వినాయక్ నగర్ లో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపనికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీల అమరవీరుల స్తూపం గా నామకరణం చేశామని : బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ఇంచార్జ్ ప్రేమ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం లో బలై పోయిన అమరవీరులంతా 99% బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజలే అని, అధికారం లోకి వచ్చిందంత అగ్రకుల దొరలు, విషం బీసీ ఎస్సీ ఎస్టీ లకు వచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుమన్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా ప్రతినిధులు ప్రశాంత్, డీఎస్పీ మండల అధ్యక్షులు మైపాల్,ముఖ్య నాయకులు గోపి,మోహన్,ఆత్మ గౌరవ్ పాల్గొన్నారు.