వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని జానకంపేట గ్రామానికి చెందిన ఎడ్ల దావీద్ ఇటీవల మరణించాడు. బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఎడ్ల దావీదు భార్యకు రూ. 8,72,590 బీమా చెక్కును మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రీజినల్ మేనేజర్ అంజన్న, ఆర్మూర్ బ్రాంచ్ మేనేజర్ సలేందర్, డెవలప్మెంట్ ఆఫీసర్ నారాయణరెడ్డి, జానకంపేట ఎక్స్ సర్పంచ్ సౌడ రమేష్, అడ్వైజర్ తలారి శేఖర్, సౌడ శ్రీనివాస్ పాల్గొన్నారు.
