బతుకమ్మ,ఏర్గట్ల: మంగళవారం డాక్టర్ అంబేద్కర్ యువజన సంఘం, ఏ వై ఎస్ జిల్లా అధ్యక్షుడు ఇత్వార్పేట్ లింగన్న ఆధ్వర్యంలో ఏర్గట్ల మండల అధ్యక్షునిగా తొర్తి గ్రామ వాస్తవ్యుడు రవీందర్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఇట్టి నియమకు పత్రాన్ని మోర్తడ్ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రవీందర్ కు నియామక పత్రం అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో అంబేద్క రైట్ సీనియర్ నేత పాలెం చిటూమల రాజన్న, జర్నలిస్ట్ మామిడి రాజు, ప్రఖ్యాత కవి, గాయకులు, కవి రాజు, గౌతం మాలాజి, బొంబాయి వాస్తవ్యులు జిన్నా కాంతారావు, జిన్నా సుజనా, కూర శ్యామ్, మోర్తాడ్ నల్ల రాజన్న పాల్గొన్నారు.
