నీటిలో మునిగి మృతి చెందిన బావ, బామ్మర్దులు

0 9,662

 

. . . నీటి ఊబిలో దిగిన బామ్మర్ది, కాపాడేందుకు వెళ్లి బావ మృతి

 

పోతంగల్, బతుకమ్మ :

 

నీటిలో మునిగి బావ, బామ్మర్దులు మృతి చెందిన విషాద సంఘటన పోతంగల్ మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం, కూర్మ గంగోండ ఇద్దరు బావ, బామ్మర్దులు. గంగోండ పోతంగల్ లో నివసిస్తుండగా, గంగారం రెంజల్ మండలం బోర్గాంలో నివసిస్తు ఉంటాడు. గంగారం తన బామ్మర్ది ఇంటికి ఆదివారం చుట్టపు చూపుగా వచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి మంజీరా నదిలో గొర్రెలకు నీటి తాగించేందుకు వెళ్లారు. అప్పుడే గంగోండ నీటిలో దిగి ఊబిలో ఇరుక్కుని మునిగిపోవడంతో అతని బావ గంగారం కాపాడేందుకు నీటిలో దిగి కాపాడే క్రమంలో అతను కూడా మునిగి పోయాడు. గంగోడ మృత దేహం వెలికి తీయగా గంగారం మృత దేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. దీంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.