. . . రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
బోధన్, బతుకమ్మ:
లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు బోధన్ ఎస్ఐ 1 భాస్కర చారీ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 1 పనిచేస్తున్న బాస్కర చారి ఒక వ్యక్తి నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ రెంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.

ఒక సివిల్ వివాదానికి సంబంధించిన విషయంలో లేదా పాత కేసులో సెక్షన్ మార్పు కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఆయనపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం పై విచారణ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా లో వర్ని ఎస్ఐ ఏసీబీకి దొరికిన తర్వాత మరో ఎస్ఐ అవినీతి కేసులో పట్టుబడటం తోలిసారి.

