- ఇసుక క్వారీలను పరిశీలించిన సబ్ కలెక్టర్
బోదన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లోని మంజీరా నది పరివాహక ప్రాంతాలైన కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్ గావ్ గ్రామాలలో ప్రభుత్వ అనుమతితో ఏర్పాటుచేసిన ఇసుక క్వారీలను బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. గత కోన్ని రోజులుగా ఇసుక తరలింపుతో అన్నదాతల ఇబ్బందులపై ‘ బతుకమ్మ’ లొ వచ్చిన కథనంపై సబ్ కలెక్టర్ స్పంధించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతొ బుదవారం ఇసుక తరలించే ప్రతి వాహనాన్ని, వే బిల్లులను పరిశీలించారు. అలాగే వాహనచోదకులకు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలని వాహనాన్ని నడిపేటప్పుడు అజాగ్రత్త వహించకూడదని తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇసుక రవాణాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడిన, వాహనం నడిపేటప్పుడు వాహన చోదకులు అజాగ్రత్త వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ తో పాటు మండల తహసిల్దార్ విటల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

