కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలం కోనసముందర్ గ్రామానికి చెందిన సీ. హెచ్ సత్యగంగుఅనే బాధిత మహిళకు శస్త్రచికిత్స నిమిత్తం ఎల్ ఓ సీ ని బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బుధవారం ఇప్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ భాధితురాలు సీ.హెచ్ సత్యగంగు హైదరబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించగా వైద్య ఖర్చుల నిమిత్తం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.1,25,000 ఎల్. ఓ. సీ ని ఇప్పించారు. అందుకు సంబందించిన ఎల్ ఓ సీ కాపీని భాధితురాలికి సునీల్ అనుచరులు అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు బాధిత రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
