కామారెడ్డి సిటీ బతుకమ్మ : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్,ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
