జుక్కల్, బతుకమ్మ : బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్కార్ మల్లికార్జున్ అప్పా చిత్రపటానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నివాళులు అర్పించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ అప్పా సతీమణిని పరామర్శించి,ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.