బాన్సువాడ, బతుకమ్మ :
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ ( పతంగుల పండుగ ) నిర్వహించారు. బుధవారం జరిగిన కైట్ ఫెస్టివల్ లో పట్టణ వాసులు, చిన్నారులతో కలిసి కైట్ (పతంగి) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా అందర్నీ ఉత్తేజ పరిచి యువతలో పిల్లలలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం బాన్సువాడ నుంచి పండరి పూర్ కు పాదయాత్ర గా వెళ్ళుతున్న భక్తుల బృందానికి ఈరోజు పట్టణంలోని పాత బాన్సువాడ హనుమాన్ మందిర్ వద్ద జెండా ఊపి పోచారం , బాలరాజు లు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, చిన్నారులు పాల్గొన్నారు.



