హైదరాబాద్, బతుకమ్మ : రాజీవ్ గాంధీ వల్లే ఇప్పుడు ఐటీ రంగం రాణిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పని చేస్తున్నాయన్నారు… హైటెక్ సిటీకి కాంగ్రెస్ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. హైదరాబాద్ను ఇలానే వదిలేస్తామని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కొందరికి నచ్చడం లేదన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో హైదరాబాద్కు పోటీ పడుతుందన్నారు. ఈకార్య క్రమంలో మంత్రులు పాల్గొన్నారు.

