- నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న నెట్ వర్క్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్ నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో శుక్రవారం ఆయన చైర్మన్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతోపాటు టెలికాం అడ్వైసరీ కమిటీ సభ్యులు, జీఎం మెంబర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ జగరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

