భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో రోబోటిక్ టెక్ ఎక్స్పో పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ లో అడ్విటెక్ రోబోటిక్స్ సంయుక్తం ఆధ్వర్యంలో మంగళవారం టెక్ ఎక్స్పో రోబోక్వెస్ట్ 2కె25 కార్యక్రమంను నిర్వహించారు. దీనిలో భాగంగా ఆధునిక టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతం లో చదువుకుంటున్న పిల్లలకి ఏ. ఐ, రోబోటిక్స్ మీద అవగాహనా, వాటి ప్రాముఖ్యతను వివరించి తెలుపలానే ఉద్దెశ్యంతో ఈ సంస్థను స్థాపించామని ఈ సంస్థ మేనజింగ్ డైరెక్టర్ మారుతీ గ తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ టెక్ వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అడ్వైటెక్ రోబో్టేక్స్ డైరెక్టర్ రామావత్ శ్రీకాంత్ ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో అడ్విటెక్ రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, ఎం ఈ ఓ స్వామి, పైడిమర్రి లింబాద్రి,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

