- ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్, బతుకమ్మ : ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నిర్వహించారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి వారి యొక్క సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగింది. ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుండడం హర్షించదగ్గ విషయమని అన్నారు.గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో ప్రజలు వివిధ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
