సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనపై పరిశ్రమ సెక్రటరీ వివేక కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈప్రమాద ఘటనలో 40 మంది మరణించినట్లు, 33 మంది గాయపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని, అలాగే గాయపడిన వారికి పునరావాసం కల్పిస్తామని, అండగా ఉంటామని వెల్లడించారు. 90 రోజుల వరకు ప్లాంట్ లో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

