. . . అహ్లే సున్నతుల్ జమాత్ పిలుపు మేరకు కొనసాగుతున్న బంద్
. . . స్వచ్చంధంగా వ్యాపార సముదాయాలను మూసివేసిన వ్యాపారులు
. . . పోలిస్ లు భారీ బందోబస్తు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
మహ్మద్ ప్రవక్తపై కోందరు చేసిన వివాదస్పథ వాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో సోమవారం బంద్ పాటిస్తున్నారు ప్రజలు. ఐతే అది మైనార్టి ఎరియాలకు పరిమితమైయ్యాయి. నిజామాబాద్ నగరంలోని గాంది చౌక్, బోదన్ రోడ్డు, ఖిల్లా రోడ్డు, అజం రోడ్డులో ఉదయం వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలను మూసివేశారు.
కామారెడ్డి, బోదన్, ఆర్మూర్, బాన్సువాడ ప్రాంతాలలో అహ్లే సున్నతుల్ జమాత్ పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నారు. తమ మనోబావాలను దెబ్బతిసేల మాట్లాడిన వ్యక్తిపై ఉపా కేసు నమోదు చేయాలని మైనార్టిలు గత కొన్ని రోజులుగా నిరసనలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నిరసనకు పిలుపు నిచ్చిన పొలిస్ శాఖ అనుమతించలేదు. మైనార్టి ఎరియాలో కొనసాగుతున్న బంద్ సంధర్బంగా అయా ప్రాంతాలలో బారీ బందోబస్తు ఎర్పాటు చేశారు. దసరా పండగ వేళ జరుగుతున్న నిరసన మద్యహ్నం వరకు కొనసాగుతుందని తరువాత యాదావిదిగా వ్యాపార వాణిజ్య సముదాయాలను తెరిచేందుకు వ్యాపారులు సిద్ధమౌతున్నారు

