రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటీయూ, సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కార్మిక హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రుద్రూర్ మండల అధ్యక్షులు బండెల భీమయ్య, గ్రామ పంచాయితీ కార్మికుల మండల అధ్యక్షులు మాచుకూరి అశోక్, నెల్లూరు లక్ష్మణ్, రవికాంత్, బందేల హన్మండ్లు, గైనీ వెంకటీ, బొజడి గంగాధర్, సుంకరి రెడ్డి, నీరడి శంకర్, రుద్రూర్ మండల గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
