26.3 C
Hyderabad

కేటీఆర్ కు స్వాగతం పలికిన నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోరా, బతుకమ్మ :

 

విద్యార్థి ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ విప్ బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్ సెంటర్ జైల్ లో నిర్బంధించిన విషయం నేపథ్యంలో అన్యాయాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరామర్శించడానికి బయలు దేరారు. జిల్లా జైలు లో ఉన్న బాల్క సుమన్ ను పరామర్శించడానికి బాల్కొండ నియోజకవర్గం మీదుగా ఆదిలాబాద్ వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article