రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల పరిధిలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ నందు బోధన్ కు చెందిన షేక్ పాషా 4 నెలల క్రితం 21,000 పాలసీ తీసుకోవడం జరిగింది. వారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబానికి మంగళవారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 3,37,000/ రూపాయలు కంపెనీ డీజీమ్ సురేష్, డిఎం నగేష్ ద్వారా నామిని అయినటువంటి భార్య అమీనాబీకు తహసీల్దార్ తారాబాయి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సౌందర్య, ఎంప్లాయి రాఘశ్రీ, మహేందర్, సురేఖ, వికాస్ డెవలప్మెంట్ ఆఫీసర్ దిలీప్ పటేల్ ఏజెంట్ జెరీనా, వార్డు మెంబర్ అమృత వడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
