భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నృసింహా స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం భక్తులకు ఆలయ ప్రవేశం 10 గంటల తర్వాత ఆలస్యంగా ఉంటుందని ఆలయ ధర్మకర్త నంభి విజయ సారథి తెలిపారు. శ్రీమదుత్తరాది మఠాధీశులు శ్రీ శ్రీ 1008శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీ పాదుల వారు లింబాద్రి గుట్టకు వేంచేస్తున్నారని, వారు స్వామి వారికి ఏకాంతంలో అర్చన చేయనున్నారని తెలిపారు. అందువలన భక్తులు ఈ విషయాన్నీ గమనించి స్వామి వారి దర్శనం కు 10 గంటల తర్వాత రావాలని కోరారు.