పహాల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో…
డిల్లీ, బతుకమ్మ : పహాల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీ బుధవారం సమావేశం కానుంది. ఈసమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. తొలిసారి గత బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రత వ్యవహారాల క్యాబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నరమేధానికి పాల్పడిన ముష్కరులను శిక్షించడంతోపాటు వారిని ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామని పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించింది. సోమవారం ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈసమావేశం జరిగింది.
