మోపాల్, బతుకమ్మ : మోపాల్, నిజామాబాద్ గ్రామీణ మండలం తపస్ డైరీ, క్యాలెండర్ ను శనివారం ఎంఈఓ గేమ్ సింగ్, ఎంఈఓ సేవ్లా నాయక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు బద్రీనాథ్, జడ్.పి.హెచ్.ఎస్ మోపాల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోవింద్ నాయక్, మోపాల్ మండల అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వర్, గంగాధర్, బాధ్యులు నాడా పురం గణేష్, అర్బన్ బాధ్యులు దర్బార్ అనిల్, రాజేశ్వర్, మహిళ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.