27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు

Must read

📰 Generate e-Paper Clip

  • అడ్డుకునేవారెవరు..?
  •  ప్రభుత్వ ఆదాయానికి గండి

 

రుద్రూర్, బతుకమ్మ : మట్టి మాఫియా కళ్లు పడి చెరువులు చిక్కి శల్యమౌతున్నాయి. అక్రమంగా మట్టి తరలించుకు పోతుండడంతో స్వరూపాలు మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి, ప్రభుత్వ పెద్దల అండతో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ చెరువులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో మట్టి తవ్వి అమ్ముకుంటున్నారు. రుద్రూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం కొంత మంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీతో చెరువులో నల్ల మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి పొలానికి తరలిస్తున్నారు. ఇష్టానుసారంగా చెరువులను తవ్వేయటం వల్ల చెరువు రూపురేఖలు మారిపోతున్నాయని గ్రామస్థులు లబోదిబో మంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చెరువులో మట్టి త్రవ్వకాలు చేపడుతున్న వారి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Illegal excavation of soil

More articles

Latest article