బతుకమ్మ,మోర్తాడ్: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని, ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్ధులు నేర్పడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ రావు అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అమ్మ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఆరు నుండి పదవ తరగతి ప్రవేశం పొంది విద్యార్థులు కలిసి ముగ్గురు విద్యార్థులను చేర్చుకోవడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ వసంత, ఉపాధ్యాయులు మహేష్ కుమార్, రాజేందర్, నచ్చయ్య, గంగాధర్, సైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.

