24 C
Hyderabad
Sunday, August 2, 2026

అంగరంగ వైభవంగా హనుమాన్ స్వాముల శోభాయాత్ర

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం (ఆర్) గ్రామంలో శనివారం హనుమాన్ స్వాములు శోభయాత్ర నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిక్ష దాత గంగలి సావిత్రి హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజనలు, కీర్తనలతో డీజే చప్పులతో శోభయాత్ర కొనసాగింది. అదే విధంగా అంబం గ్రామం నుండి కొండగట్టు వరకు హనుమాన్ స్వాములు మంత్రి దత్తు, శానంశ్రవణ్, గణేష్, ప్రణయ్, ఆర్.గంగాధర్, గోపి, ఆర్. రాజు స్వాములు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ శోభయాత్రలో హనుమాన్ స్వాములు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article