రుద్రూర్(వర్ని), బతుకమ్మ :
వర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామంలో బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద బ్లడ్ ఫౌండర్ సంతోష్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద బ్లడ్ ఫౌండర్ సంతోష్, లయన్స్ క్లబ్ ఇన్ చార్జ్ హనుమంతరావు, గుజ్జ అశోక్, అల్లం సాయిలు, దర్శనం శంకర్, గుజ్జ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
