. . . బస్సును నిలిపి తనిఖీలు చేపట్టిన పోలీసులు
నందిపేట్, బతుకమ్మ :
బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ప్రయాణికురాలు మెడలో నుంచి బంగారు గుండ్లు మాయం అయ్యాయి. విషయాన్ని గమనించిన మహిళ తన బంగారం గుండ్లు పోయాయని లబోదిబోమంది. వెంటనే బస్సు డ్రైవర్ బస్సును నందిపేట్ పోలీస్ స్టేషన్ తరలించి తనిఖీలు చేపట్టారు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నందిపేట్ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి బంగారు గుండ్లను వెతికే పనిలో పడ్డారు. అందులో ఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించి గాలించారు.
