రుద్రూర్, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదివి 10 వ తరగతిలో మండల్ టాపర్ గా వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో మండల్ టాపర్ గా నిలిచిన విద్యార్ధి అద్నాన్ కు గురువారం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిల్ ను అందజేశారు. అనంతరం విద్యార్ధి తండ్రి ఎండి నసీమ్ ఉద్దీన్ కు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ బృందం మార్కెల్లి ప్రకాష్ పటేల్, సున్నం సాయిలు, వడ్ల శేఖర్, ప్రశాంత్ గౌడ్, కటిక రామ రాజు, బోజిగొండ అనిల్, రాజేష్ బాబు, ఏముల నవీన్, ఆలపాటి హరికృష్ణ, గోవురు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
