నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణలో విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాలలో గల ఎల్.ఎల్.బి కోర్సుల్లో ఖాళీగా ఉన్న 14 సీట్లకు 12 , ఎల్.ఎల్.ఎం లో ఖాళీగా ఉన్న ఒక సీటు ను 2024 స్టేట్ ఎంట్రన్స్ ర్యాంకు మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ విశ్వవిద్యాలయ నిబంధనలను అనుసరించి తక్షణ ప్రవేశాలను భర్తీ చేశామని తెలంగాణ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ పేర్కొన్నారు. ఈ తక్షణ ప్రవేశాల్లో 29 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ ప్రవేశాల ప్రక్రియ న్యాయ కళాశాలలో సెమినార్ హాలులో నిర్వహించి ఎంపికైన విద్యార్థుల వివరాలు ప్రకటించామని అడ్మిషన్స్ డైరెక్టర్ పేర్కొన్నారు.తక్షణ ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఫీ రియంబర్స్మెంట్, హాస్టల్ వసతి ఇవ్వబడదన్నారు.

