26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించే దిగుబడి పొందాలని సూచించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్, తహశీల్దార్ తారాబాయి, వ్యవసాయ అధికారి సాయికృష్ణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article