కమ్మర్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలంలో యూరియా కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు . కమ్మర్ పల్లి మండలం కోన సముందర్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ పరిధిలో 400 మంది రైతులు యూరియా కోసం ఎదురుచూస్తుండగా 170 బస్తాలు మాత్రమే వచ్చింది. యూరియా కోసం సొసైటీ వద్ద రైతుల క్యూలో నిల్చున్నారు. టోకెన్లు ఉన్న వాటికే ఇస్తామని, ముందు వచ్చిన వారికి ఇస్తామని సొసైటీ సిబ్బంది తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
