32.2 C
Hyderabad

నవీపేట్ లో రైతు సదస్సు

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : నవీపేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నవీపేట్ కిసాన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు  ఎరువుల వాడకం గురించి అవగాహన కల్పించారు. ఎరువులను ఎంత తక్కువ మోతాదులో వాడితే భూసారం అంత బాగుంటుంది అని తెలుపుతూ రాబోయే రోజులలో యూరియాని తక్కువ మోతాదులో వాడుతూ అధిక దిగుబడులను తేవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్. సి. ఎఫ్. లిమిటెడ్ ఏరియా  కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఏవో నవీన్ కుమార్, చైర్మన్ ఆర్ పృథ్వీరాజ్, సీఓ అనీష్ రాజ్, కంపెనీ సిబ్బంది గడీల చంద్రశేఖర్,  గ్రామ రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article