29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో

Must read

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాల సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసుల ముందంజ

సీఎం రేవంత్ రెడ్డి

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సైబర్ నేరాలను అదుపు చేయడానికి తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాలకు పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్ఐసీసీలో మంగళవారం నిర్వహించిన ’షీల్డ్ 2025‘ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీల్లో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారని అన్నారు. గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు  కోసం కొత్తగా 7 పోలీసులు స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.  దొంగలు ఎక్కడో ఉండి, మన సొమ్ము దొంగలిస్తున్నారు. నేరం ఎక్కడి నుంచి ఎవరు చేశారో కనుక్కోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. నేరాల శైలి మారడంతో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని చెప్పారు.

More articles

Latest article