బతుకమ్మ, బోధన్: బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో “చదివే ముద్దు – మత్తు వద్దు” నినాదంతో అవగాహన సెమినార్ జరిగింది. ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బోధన్ సిఐ వెంకట్ నారాయణ, ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు, డాక్టర్ ఎం.వి.ఎస్. సుధాకర్ మత్తు దుష్ప్రభావాలపై సూచనలు ఇచ్చారు. యార్లగడ్డ సాయిబాబా, సాయికుమార్, గోపాల్ సింగ్ ఠాగూర్ డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

