27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మద్నూర్ ఏఎంసీ చైర్ పర్సన్ గా సౌజన్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మద్నూర్: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్ పర్సన్ గా జి సౌజన్య నియమితులయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన సతీమణి తోట అర్చన తో కలిసి సౌజన్య ఇంటికి వెళ్లి నియామక పత్రాన్ని గురువారం అందజేశారు. వైస్ చైర్మన్ గా పరమేశ్ పటేల్ తో పాటు 16 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నూతన పాలకవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ నూతన కార్యవర్గం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

Courtesy Madnoor AMC Chairperson

More articles

Latest article